Conversations on contemporary literature from across the world, in translation.

Telugu Interviews Episodes

Thoughtful interviews with notable Telugu writers, discussing their works and impact on literature.
75
Sept. 2, 2023

వీర నాయకుడు: పతంజలి శాస్త్రి గారి నవలాసమీక్ష - సునీత రత్నాకరం గారు

ఈ ఎపిసోడ్ లో సునీత రత్నాకరం గారు పతంజలి శాస్త్రి గారి రచనలపై పాఠకురాలిగా తన అభిప్రాయాన్ని చెబుతూ, ఆయన రాసిన వీర నాయకుడు నవలను సమీక్షిస్తారు. సునీతా రత్నాకరం గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ లక్నో లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
* For your Valuable feedback on this Episode - Please click the below link
https://bit.ly/3NmJ31Y
Harshaneeyam on Spotify App –http://bit.ly/harshaneeyam
Harshaneeyam on Apple App –http://appl...
62
July 29, 2023

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు

మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.

ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన ఉప్పులూరి కామేశ్వర రావ...
52
June 16, 2023

నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం

ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి, తన యాత్రల గురించి పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకన తిరిగి 'భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆరు ఖండాలలోని ముప్ఫయి ఐదు దేశాలలో తిరిగి 'భూ భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని రాసారు. తెలుగులో మొదటి యాత్రా సాహిత్యం గా ప్రసిద్ధికెక్కిన 'కాశీ యాత్రా చరిత్ర' ను ఆధునీకరించి ప్రచురించారు.

ఎపిస...
47
May 27, 2023

తెలుగు వారి తమిళ కతలు - 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో...

ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అంద...
37
May 6, 2023

మూడవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
36
May 6, 2023

రెండవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
35
May 6, 2023

మొదటి భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
32
April 30, 2023

రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ

తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం 'గాలి పొరలు' గురించి ఆయన వివరించారు.

ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు.

ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.

https://bit.ly/3HpeTre

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండ...
28
April 19, 2023

హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)

హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -

https://forms.gle/FiYgAbqjqncYUiqo7

హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో -

https://bit.ly/harsharanga

హర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము. ఈ మధ్యకాలంలో అనువాద కథలతో పాటు, ఇతర దక్షిణాది భాషా రచయితలను , ప్రచురణ...
22
March 10, 2023

యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం

ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. 'భూమి పతనం' అనే నవల, 'ఇయ్యాల మా వూళ్ళో' అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి.

ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం 'గరికపాటోడి కథలు' అనే కథా సంపుటి ని, 'కాపలాదారుల పాటలు' అనే కవితాసంపుటిని ప్రచురించే పనిలో వున్నారు.

భూమి పతనం నవల కొనడానికి -

https://bi...
20
March 5, 2023

‘చిలుకంబడు దధికైవడి’ - మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’

ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ ...
21
March 4, 2023

‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు

‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు.
వారికి కృతజ్ఞతలు.
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గుర...
17
Feb. 17, 2023

మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది.

పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్స...
200
Feb. 13, 2023

Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్...
199
Feb. 13, 2023

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. ...
148
Feb. 13, 2023

సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.

కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –

‘పొగడ పూలు’:

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప...
207
Feb. 12, 2023

స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub
ఉత్తర పొద్దు :

మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.

ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.

జ...
16
Feb. 11, 2023

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది.

పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి -

https://amzn.to/3EoRIMn

Harshaneeyam on apple podcast

https://apple.co/3K1vMdw

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy...
14
Feb. 4, 2023

'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ

మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు.

This podcast uses the following third-party services for analysis:
...
13
Jan. 21, 2023

'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది.

'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

http://bit.ly/3wg2nUW

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
91
Nov. 3, 2022

హర్షణీయంలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు.

హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం.

గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది.

దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము.

ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న ఈ ' కథా నీరాజనం' కార్యక్రమం.

కథా నీరాజనంలో భాగంగా, ప్రతి ...
103
Nov. 2, 2022

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - రెండవ భాగం

హర్షణీయానికి స్వాగతం.

ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ రెండవ భాగం వింటారు.

ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది.

తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు.

వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివ...
102
Nov. 1, 2022

హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - మొదటి భాగం

హర్షణీయానికి స్వాగతం.

ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు.

ఇంటర్వ్యూలో ఆయన తన రచన శైలి గురించి, తన కథా సంకలనం 'సోల్ సర్కస్' లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది.

తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు.

వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివ...
119
Oct. 31, 2022

శ్రీరమణీయం - నాలుగో భాగం : వారి కథా రచన

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .

సుప్రసిద్ధ కథకులు , పత్రికాసంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.

శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.

తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగ...
Talk to us!